మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్య

మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్య

సోషల్ మీడియా దిగ్గజం మెటా.. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమించినట్టు కంపెనీ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో మెటా సంస్థకు రాజీనామా చేసిన అజిత్ మోహన్ స్థానంలో సంధ్యను తీసుకున్నారు.

సంధ్యా దేవనాథన్ 2016లో మెటాలో చేరారు. సింగపూర్, వియత్నాం వ్యాపారాలు, బృందాలతో పాటు ఆగ్నేయాసియాలోని మెటా ఈ-------కామర్స్ కార్యక్రమాల బాధ్యతలు తీసుకున్నారు.

తర్వాత 2020లో ఇండోనేషియాకు వెళ్లి, ఏపిఏసీ కోసం గేమింగ్‌ లీడ్ గా పనిచేస్తుంది. అయితే, సంధ్య మెటా భారత వైస్ ప్రెసిడెంట్ గా తన బాధ్యతలను జనవరి 1, 2023నుంచి తీసుకోనుంది. వైస్ ప్రెసిడెంట్ గా సంధ్యను నియమించడంపై మెటా ఆనందం వ్యక్తం చేస్తుంది. ‘భారత్ లో మెటా కొత్త నాయకురాలికి స్వాగతం పలుకుతున్నాం. ఆమె నాయకత్వంలో మెటా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం’ అని మెటా వ్యాపార అధికారి మార్నే లెవిన్ అన్నాడు.