గండిపేట, వెలుగు: బీజేపీ రాజేంద్రనగర్ సెగ్మెంట్ ఇన్చార్జి(ప్రభారీ)గా రాష్ట్ర అధికార ప్రతినిధి జె. సంగప్పను పార్టీ అధిష్టానం నియమించింది. సంగప్ప నియామకంపై రాజేంద్రనగర్ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న సంగప్ప.. అనతి కాలంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారన్నారు. రాజేంద్రనగర్ సెగ్మెంట్లో నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయ పరిచి పార్టీని సంస్థాగతంగా బలపడేలా
చేస్తారన్న నమ్మకముందని స్థానిక నేతలు తెలిపారు.