బీజేపీ రాజేంద్రనగర్ సెగ్మెంట్ ఇన్​చార్జిగా సంగప్ప

బీజేపీ రాజేంద్రనగర్ సెగ్మెంట్ ఇన్​చార్జిగా సంగప్ప

గండిపేట, వెలుగు: బీజేపీ  రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్ ఇన్​చార్జి(ప్రభారీ)గా  రాష్ట్ర అధికార ప్రతినిధి  జె. సంగప్పను పార్టీ అధిష్టానం నియమించింది. సంగప్ప నియామకంపై  రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్టుగా  పేరు తెచ్చుకున్న సంగప్ప..  అనతి కాలంలోనే  రాజకీయ నాయకుడిగా ఎదిగారన్నారు. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్​లో నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయ పరిచి పార్టీని సంస్థాగతంగా బలపడేలా 
చేస్తారన్న నమ్మకముందని స్థానిక నేతలు తెలిపారు.