ఆదరించండి.. సేవ చేస్తా: చింతా ప్రభాకర్​ 

ఆదరించండి.. సేవ చేస్తా: చింతా ప్రభాకర్​ 

కంది, వెలుగు : ఎమ్మెల్యేగా ఆదరిస్తే.. ఐదేళ్లు మీ సేవ చేసుకుంటానని బీఆర్ఎస్​సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్​ కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని  కొత్లాపూర్,  దాసుగడ్డ తండా, హనుమాన్ నగర్, గుడి తండా, గౌడిచర్ల, ఇస్మాయిల్ ఖాన్ పేట్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు స్వాగతం పలికి, పెద్ద గజమాలతో సన్మానించారు.  యువత బైక్ ​ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్​ ఉనికిని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా చింతా ప్రభాకర్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఇంతకాలం ప్రజల మధ్య ఉండి వారి బాగోగులు చూసుకున్నానన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కారించానన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను పేద ప్రజలకు చేరువచేశానన్నారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా  సంగారెడ్డి పట్టణానికి చెందిన 37వ వార్డు ఇన్‌చార్జి జలేందర్ అధ్వర్యంలో చింతా ప్రభాకర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్​ యువకులు బీఆర్ఎస్ లో చేరారు. ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.