గీతంలో అదరగొట్టిన ఆటమ్​ బైక్

గీతంలో అదరగొట్టిన ఆటమ్​ బైక్
  •     సందడిగా రెండో రోజు టెక్నో- కల్చరల్​ 

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలని గీతం డీమ్డ్​యూనివర్సిటీ ఆన్యువల్ ఫెస్ట్​ ప్రమాణలో ఆటమ్ ఎలక్ర్టిక్​ బైక్​లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెక్నో-కల్చరల్​ఫెస్ట్​లో రెండో రోజు శుక్రవారం స్టూడెంట్స్​ఆటమ్​ఎలక్ర్టిక్​ బైకులతో సందడి చేశారు. ఆటో షోలో భాగంగా బైకులను నడుపుతూ పలు విన్యాసాలు చేశారు. విశాక ఇండస్ర్టీస్​ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్​ గడ్డం వంశీకృష్ణ ఎలక్ర్టిక్​ వాహనాలపై ఉన్న ఆసక్తితో ఆటమ్​ బైక్​రూపొందించారు. దీనిపై ఆరు పేటెంట్లు పొందారు. 

పెట్రోల్​తో నడిచే స్పోర్ట్స్​ బైక్​లతో సమానంగా ఆటమ్​ అన్ని ఫార్మాట్లలో సూపర్​ ఫర్ఫామెన్స్​ ఇచ్చిందని బైక్​ నడిపిన స్టూడెంట్స్ తెలిపారు. అన్ని వర్గాల యువతకు అందుబాటు రేటులో, తక్కువ చార్జ్​తో ఎక్కువ రేంజ్​ వచ్చేలా బైక్​ తయారు చేయడం గొప్పవిషయమని కొనియాడారు. ప్రమాణ ఉత్సవాల్లో భాగంగా ఎంటప్రెన్యూర్​ వర్క్​షాప్​, ఆర్కిటెక్చర్​ మోడళ్ల ర్యాంప్​వాక్​, రా అండ్​ రియల్​ డాన్స్​లు, రోబో సాకర్​ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

 కల్చరల్​ఆక్టివిటీలో సినీ గాయకులు రామ్​ మిరియాల, సాహితీ చాగంటి సందడి చేశారు. చివరి రోజైన ఆదివారం భారత్​లోనే పేరొందిన ప్రముఖ డీజే ప్రాజెక్ట్​ 91, స్కాట్లాండ్ నుంచి వస్తున్న నినా సుర్టా సంగీత హోరుతో ప్రమాణ ఫెస్ట్​ ముగిస్తుందని గీతం ప్రతినిధులు తెలిపారు. 

Also Read : సితార పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహేశ్‌ టీమ్‌