సభను సక్సెస్​ చేస్తాం : జగ్గారెడ్డి

సభను సక్సెస్​ చేస్తాం : జగ్గారెడ్డి
  •       టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి

రామచంద్రాపురం, వెలుగు :  తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్​ విజయభేరి సభను సక్సెస్​ చేసి తీరుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. గురువారం రామచంద్రాపురం పార్టీ కార్యాలయంలో పటాన్​చెరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి, విజయభేరి సభపై ఆయన దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమోజన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజయభేరి సభకు సహాయంగా తెల్లాపూర్​కు చెందిన కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు అరుణ్ రూ.లక్ష చెక్కును జగ్గారెడ్డికి అందజేశారు. నాయకులు శ్యామ్​ గౌడ్​, సపాన్​దేవ్​, శ్రీనివాస్​ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మవీన్​ గౌడ్​ పాల్గొన్నారు.