WTC Final 2025: ఛాన్స్ దక్కకున్నా చిల్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంజాయ్ చేస్తున్న భారత యువ క్రికెటర్

WTC Final 2025: ఛాన్స్ దక్కకున్నా చిల్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంజాయ్ చేస్తున్న భారత యువ క్రికెటర్

టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం 18 మందితో కూడిన భారత జట్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఏడాదిగా టీంఇండియాలో కొనసాగుతున్న అతనికి టెస్ట్ జట్టులో స్థానం లభించకపోవడం విచారకరం. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. 

భారత జట్టులో స్థానం దక్కపోయినా అతను సర్ఫరాజ్ చిల్ అవుతున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టీఎస్  ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కు హాజరయ్యాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆటలో తన తండ్రి నౌషాద్ ఖాన్ తో కలిసి స్టేడియంలో తళుక్కున మెరిశాడు. చారిత్రాత్మక వేదికను ఆస్వాదించిన ఫోటోలను సర్ఫరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో రెండో రోజు బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. 

తొలి రోజుతో పాటు రెండో రోజు కూడా ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. 43/4 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 57.1 ఓవర్లలో 138 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 40 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (16 బ్యాటింగ్‌‌‌‌), నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారూలు 218 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రోజుల ఆట మిగిలి ఉంది.