
హైదరాబాద్: పంటరుణాల మాఫీపై సర్కార్ కు స్పష్టత లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శనివారం గాంధీభవన్ లో సమావేశం అయిన పార్టీ ముఖ్య నేతలు… బడ్జెట్ సమావేశాలు… వ్యవసాయ , రైతు అంశాలపై చర్చించారు. రైతు బంధు …రైతులందరికీ అందడం లేదన్నారు. మరణించిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంది రైతులను ఆదుకోవాలన్నారు.