మాజీ స‌ర్పంచ్ మంచి మ‌న‌సు.. ఒంట‌రిగానే కరోనా శ‌వాన్ని ట్రాక్ట‌ర్ లో వేసుకుని అంత్య‌క్రియ‌లు

మాజీ స‌ర్పంచ్ మంచి మ‌న‌సు.. ఒంట‌రిగానే కరోనా శ‌వాన్ని ట్రాక్ట‌ర్ లో వేసుకుని అంత్య‌క్రియ‌లు

తానే స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డుపుతూ తీసుకెళ్లాడు
క‌రోనా సోకుతుంద‌ని ముందుకు రాని గ్రామ‌స్థులు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: క‌రోనా మ‌హ‌మ్మారికి ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలుతున్న‌రు. ఇటువంటి స‌మ‌యంలో క‌రోనా డెడ్ బాడీకి అంత్య‌క్రియ‌లు చేయాలంటేనే జ‌నం జంకుతున్న‌రు. ఈ క్ర‌మంలోనే చాల‌మంది పోలీసులు, స‌ర్పంచ్ లు ముందుకు వ‌చ్చి, అంత్య‌క్రియ‌లు జ‌రిపిస్తున్నారు.  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని, వీర‌వెల్లి గ్రామంలో శుక్ర‌వారం(మే-07)న‌ క‌రోనాతో ఓ మ‌హిళ చ‌నిపోయింది. అంత‌క్రియ‌లు చేయ‌డానికి గ్రామ‌స్థులు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో.. స్వ‌యానా ఆ గ్రామ  మాజీ స‌ర్పంచ్..ప్ర‌స్తుత స‌ర్పంచ్ క‌ల్ప‌న భ‌ర్త‌ తంగెళ్ళ‌ప‌ల్లి శ్రీనివాస‌చారి అంత్య‌క్రియ‌లు జ‌రిపించారు. తానే స్వ‌యంగా డెడ్ బాడీని ట్రాక్ట‌ర్ లో వేసుకుని అత‌డే డ్రైవింగ్ చేసిన స‌ర్పంచ్ ఒంట‌రిగానే స్మ‌శానానికి తీసుకెళ్లి మంచి మ‌న‌సు చాటుకున్నాడు.