తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ తీసుకెళ్లాడు
కరోనా సోకుతుందని ముందుకు రాని గ్రామస్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా: కరోనా మహమ్మారికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నరు. ఇటువంటి సమయంలో కరోనా డెడ్ బాడీకి అంత్యక్రియలు చేయాలంటేనే జనం జంకుతున్నరు. ఈ క్రమంలోనే చాలమంది పోలీసులు, సర్పంచ్ లు ముందుకు వచ్చి, అంత్యక్రియలు జరిపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని, వీరవెల్లి గ్రామంలో శుక్రవారం(మే-07)న కరోనాతో ఓ మహిళ చనిపోయింది. అంతక్రియలు చేయడానికి గ్రామస్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. స్వయానా ఆ గ్రామ మాజీ సర్పంచ్..ప్రస్తుత సర్పంచ్ కల్పన భర్త తంగెళ్ళపల్లి శ్రీనివాసచారి అంత్యక్రియలు జరిపించారు. తానే స్వయంగా డెడ్ బాడీని ట్రాక్టర్ లో వేసుకుని అతడే డ్రైవింగ్ చేసిన సర్పంచ్ ఒంటరిగానే స్మశానానికి తీసుకెళ్లి మంచి మనసు చాటుకున్నాడు.