ఎంపీడీవో ఎదుట బైఠాయించిన సర్పంచ్

ఎంపీడీవో ఎదుట బైఠాయించిన సర్పంచ్

ఖమ్మం జిల్లా: మధిరలో ఎంపీడీవో ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు సైదిలీపురం గ్రామ సర్పంచ్ చిట్టిబాబు. పల్లెప్రగతిపై ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమైన వెంటనే పెండింగ్ బిల్లులు విషయం ఏమిటని సర్పంచులు నిలదీశారు. సర్పంచ్ చిట్టిబాబు సమీక్ష చేస్తున్న ఎంపీడీవో టేబుల్ ఎదురుగా సర్పంచులు, మండల అధికారులకు అభిముఖంగా నేలపై బైఠాయించి నిరసనకు దిగారు.
నిరసన చేపట్టిన చిట్టిబాబును వారించే ప్రయత్నం చేయగా.. పెండింగ్ బిల్లులు ఎప్పుడిస్తారో చెప్పాలని ఆయన అధికారులను నిలదీశారు. రెండు మూడు ఏళ్లు గడచిపోయినా బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు కొత్త పనులు మొదలు పెట్టబోమన్నారు. పనులు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారే తప్ప బిల్లు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవట్లేదన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

పల్లెప్రగతి సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

కోతుల మధ్య ఆప్యాయత..మనుషులను మించి..