వినాయక మండపాన్ని తొలగించిన సర్పంచ్‌

వినాయక మండపాన్ని తొలగించిన సర్పంచ్‌

తూఫ్రాన్/ మనోహరాబాద్, వెలుగు : మనోహరాబాద్ ‌‌‌‌మండలంలోని జడ్పీ చైర్మన్ ‌‌‌‌దత్తత గ్రామమైన గౌతోజీగూడెంలో యువకులు ఏర్పాటు చేసుకున్న వినాయక మండపాన్ని సర్పంచ్ ‌‌‌వెంకటేశ్వర్లు తొలగించారు. ‘ఊర్లనేనే వినాయకుడిని పెట్టాలి. నేను చెప్పిందే గ్రామస్తులు వినాలి’ అని యువకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మనోహరాబాద్ బీజేపీ కార్యదర్శి మనోహర్ రెడ్డి మండపాన్ని తొలగించవద్దని బీజేపీ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో
హిందువులకు పండుగ చేసుకునే అర్హ‌త కూడా లేదా అని ప్రశ్నించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీకి చెందిన సర్పంచులు హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. సర్పంచ్ ‌‌‌‌తీరుపై గ్రామస్తులతో పాటు మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం