పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంత్రికి సర్పంచుల వినతి

పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంత్రికి సర్పంచుల వినతి

హైదరాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావును సర్పంచ్ సంఘం నేతలు కోరారు. గురువారం రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు సౌదని భూమన్న యాదవ్, అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్​ మంత్రితో భేటీ అయ్యారు. ఊర్లలో వీధి లైట్ల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించొద్దని, ఉపాధి హామీ నిధుల నుంచి పంచాయతీలకు రావాల్సిన బిల్లులు వచ్చేలా చూడాలని కోరారు. చెక్కులపై సంతకాలు చేయకుండా ఇబ్బంది పెడ్తున్న ఉపసర్పంచ్​లపై  చర్యలు తీస్కోవాలని కోరారు. కేంద్ర నుంచి ఉపాధి హామీ నిధులు రూ. 1,140 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హెల్త్ కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.