రీ ఎంట్రీపై శశికళ ఆడియో టేపులు వైరల్ 

రీ ఎంట్రీపై శశికళ ఆడియో టేపులు వైరల్ 
  • అన్నాడీఎంకేను చక్కదిద్దుతా
  • శశికళ ఆడియో టేపులు వైరల్

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటూ హింట్ ఇచ్చారు. దీనిపై ఆమె అనుచరులతో ఫోన్​లో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నాశనం కాకూడదని తాను పాలిటిక్స్‌ నుంచేతప్పుకొంటున్నట్టు 
ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్‌ ముందు శశికళ ప్రకటించారు. అయితే పార్టీలో కుమ్ములాటలు అలాగే ఉన్నాయంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను ఉద్దేశించి తాజా ఫోన్ కాల్స్ లో కామెంట్ చేశారు. ‘‘తప్పకుండా వస్తా. పార్టీని గాడిలో పెడతా. పార్టీ గొడవలతో నాశనం అవుతుంటే మౌనంగా చూస్తూ ఉండలేను. కరోనా తగ్గిన తర్వాత సపోర్టర్లతో సమావేశం అవుతా. త్వరలోనే మంచి నిర్ణయం తీస్కుం టా” అని శశికళ చెప్పినట్లుగా ఆడియో టేపుల్లో వెల్లడైంది.