
- డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కాంపల్లి అర్జున్, పార్లపల్లి రాజుకు కూడా..
కరీంనగర్, వెలుగు: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన శాతవాహన యూనివర్సిటీ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కోడూరి శ్రీవాణి, ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాంపల్లి అర్జున్, జగిత్యాల ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పార్లపల్లి రాజు శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్ డేలో పురస్కారాలను అందుకున్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, కాలేజీ విద్యాశాఖ కమిషనర్ దేవసేన, శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బెస్ట్ టీచర్గా భరత్ రెడ్డి
మంథని,వెలుగు: రాష్ట్రస్థాయిలో బెస్ట్ టీచర్గా నిలిచిన మంథని పట్టణానికి చెందిన భరత్రెడ్డి అవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. భరత్రెడ్డి మంథని గర్ల్స్ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు.