హైదరాబాద్, వెలుగు: సరైన మ్యూచువల్ ఫండ్ లేదా పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోగానే లాభాలు రావని, తదనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేదే కీలకమని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం.. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో చూసి పెట్టుబడి పెట్టడం కంటే... దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించడమే మంచిది. ఆదాయం పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ పోవాలి. ఏటా సిప్ మొత్తాన్ని టాప్ అప్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని నిలబడాలంటే అత్యవసర నిధి తప్పనిసరి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నా సిప్లను, ఫండ్స్ను మార్చకూడదు.
