న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణకు తాము గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ అమలు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను జస్టిస్విక్రమ్నాథ్, జస్టిస్సందీప్ మెహతాతో కూడిన బెంచ్ ఆదేశించింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని సోమవారం స్పష్టం చేసింది. ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్లు మానసిక సమస్యలతో సూసైడ్స్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
2023లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన బెంగాల్కు చెందిన నీట్స్టూడెంట్(17) ఆత్మహత్య ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ అప్పట్లోనే ఏపీ హైకోర్టులో పిటిషన్దాఖలైంది. ఈ ఘటనపై ఇటు ఏపీలో, అటు బెంగాల్లో కేసులు నమోదు కావడంతో.. సీబీఐకి అప్పగించే అంశం తమ పరిధిలోకి రాదని హైకోర్టు తేల్చిచెప్పింది.
దీన్ని సవాల్చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్దాఖలు కాగా.. ఈ ఏడాది జులై 25న అత్యున్నత న్యాయస్థానం 15 గైడ్లైన్స్తో కూడిన తీర్పు వెలువరించింది. కేసును సీబీఐకి అప్పగించింది. స్టూడెంట్ల సూసైడ్స్ నివారణకు దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం, ఫ్రేమ్ వర్క్ఉండాలని గైడ్లైన్స్లో పేర్కొంది.
వంద మందికిపైగా స్టూడెంట్లు ఉన్న విద్యాసంస్థ తప్పనిసరిగా మానసిక కౌన్సెలర్లను నియమించుకోవాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో సూచించింది. ఇది స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్సెంటర్లు, హాస్టళ్లు సహా అన్ని ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూట్లకు వర్తిస్తుందని తేల్చిచెప్పింది.
