రైతులకు ఎరువుల కొరత రావొద్దు : వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ

రైతులకు ఎరువుల కొరత రావొద్దు : వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ
  • జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ

సిద్దిపేట రూరల్, వెలుగు :  జిల్లాలోని రైతులకు ఎరువుల  కొరత రాకుండా చూడాలని జడ్పీ  చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అధికారులకు సూచించారు. శుక్రవారం 7 అంశాలపై స్థాయి సంఘ సమావేశం నిర్వహించి వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి,  స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, విద్యా వైద్యం, ఆర్థిక ప్రణాళిక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేసిందని

ఈ విషయం రైతులకు తెలియజేయాలని సభ్యులను కోరారు. ఆయిల్ పామ్​ సాగు లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని, జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.  సమావేశంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, జడ్పీ సీఈఓ, జడ్పీటీసీలు కవిత, లక్ష్మి, సుధాకర్ రెడ్డి, భూక్య మంగ, మంగమ్మ పాల్గొన్నారు.