దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీకి యత్నించిన ముగ్గురు వ్యక్తులు ప్రాపర్టీ డీలర్, అతని స్నేహితుడిపై కాల్పులు జరిపిన విషయం విధితమే. కాగా కాల్పులకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వీడియోలో ఏముందంటే...
బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి ఉన్నారు. ప్రత్యర్థి ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి వారి ముందు నుంచి వెళ్లి, యూటర్న్ అయ్యారు. అనంతరం బయటే నిలబడిన వికాస్ దహియా అతని స్నేహితుడు దేవివీర్సింగ్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. నిందితులలో సమీర్, బంటి మరొకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంటిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు వెల్లడించారు.