ఢిల్లీలో కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు

ఢిల్లీలో కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు

దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీకి యత్నించిన ముగ్గురు వ్యక్తులు ప్రాపర్టీ డీలర్​, అతని స్నేహితుడిపై కాల్పులు జరిపిన విషయం విధితమే. కాగా కాల్పులకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. 

వీడియోలో ఏముందంటే...

బైక్​పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి ఉన్నారు. ప్రత్యర్థి ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి వారి ముందు నుంచి వెళ్లి, యూటర్న్​ అయ్యారు. అనంతరం బయటే నిలబడిన వికాస్​ దహియా అతని స్నేహితుడు దేవివీర్​సింగ్​పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. నిందితులలో సమీర్, బంటి మరొకరు మైనర్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంటిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు వెల్లడించారు.