
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడడంలో స్టేట్డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్ ) బృందం కీలకంగా వ్యవహరిస్తుందని ఎస్పీ బి. రోహిత్ రాజు పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ ఆరో బెటాలియన్ను మంగళవారం ఆయన సందర్శించారు.
బెటాలియన్లో 100 మందితో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ బృందంతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, వరదల టైంలో ప్రజలను కాపాడేందుకు ఉపయోగించే రక్షణ పరికరాలను పరిశీలించారు. ఈ ప్రోగ్రాంలో అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాసరావు, ఆర్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.