ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడంలో ఎస్డీఆర్ఎఫ్ కీలకం : ఎస్పీ బి. రోహిత్ రాజు 

ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడంలో ఎస్డీఆర్ఎఫ్ కీలకం : ఎస్పీ బి. రోహిత్ రాజు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడడంలో స్టేట్​డిసాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​(ఎస్డీఆర్​ఎఫ్​ ) బృందం కీలకంగా వ్యవహరిస్తుందని ఎస్పీ బి. రోహిత్​ రాజు పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ ఆరో బెటాలియన్​ను మంగళవారం ఆయన సందర్శించారు.

బెటాలియన్​లో 100 మందితో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్​ బృందంతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, వరదల టైంలో ప్రజలను కాపాడేందుకు ఉపయోగించే రక్షణ పరికరాలను పరిశీలించారు. ఈ ప్రోగ్రాంలో అసిస్టెంట్​ కమాండెంట్​ డి. శ్రీనివాసరావు, ఆర్​ఐలు, బెటాలియన్​ సిబ్బంది పాల్గొన్నారు.