
పుణెకు చెందిన లా స్టూడెంట్ షర్మిస్తా పనోలిని కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే... గురుగ్రాంలో ఉంటున్న ఈ యువతిని పోలీసులు శుక్రవారం ( మే 30 ) రాత్రి అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’పై స్పందిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను అరెస్ట్ చేశారు కలకత్తా పోలీసులు. ఈ క్రమంలో షర్మిస్తా అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఆపరేషన్ సిందూర్ పై షర్మిస్తా వ్యాఖ్యలు కొంతమందికి బాధ కలిగించేలా, విచారకరంగా ఉన్నప్పటికీ... ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పిందని... షర్మిస్తాపై చర్యలు తీసుకుని, వర్సిటీ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారని అన్నారు. కానీ.. సనాతన ధర్మాన్ని గందా ధర్మం అంటూ టీఎంసీ ఎంపీలు అభ్యంతర వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ ఆగ్రహావేశాలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు. వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్టు ఎక్కడ?" అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
బీజేపీని టార్గెట్ చేస్తూ.. బెంగాల్లో విభజన రాజకీయాల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దాని "గందా ధర్మం" హిందూ మత నిజమైన సూత్రాలకు విరుద్ధమని అన్నారు మమతా బెనర్జీ.
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
— Pawan Kalyan (@PawanKalyan) May 31, 2025
But what about the deep, searing pain inflicted… pic.twitter.com/YBotf34YYe
ఆపరేషన్ సిందూర్ పై షర్మిస్తా అభ్యంతర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. ఆమెకు లీగల్ నోటీసులను పలుమార్లు పంపినప్పటికీ ఆమె, ఆమె కుటుంబం అదృశ్యమై ఆ నోటీసులపై స్పందించలేదు. దీంతో.. ఇక లాభం లేదని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు.
ఇక.. ఆమె వ్యాఖ్యల పూర్వాపరాల్లోకి వెళితే.. పనోలి ఒక వీడియోను మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఇస్లాం మతంపై, PBUHపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.