వాహనాల చార్జింగ్కు నో టెన్షన్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు పార్కింగ్ లాట్స్

వాహనాల చార్జింగ్కు నో టెన్షన్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో  రెండు పార్కింగ్ లాట్స్

 

  • 200 చార్జింగ్​ పాయింట్స్​ ఏర్పాటు  
  • మరో 9 స్టేషన్లలో కూడా..

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఎయిర్ పోర్ట్ తరహాలో రూ.714.73 కోట్లతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ఈ డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానుండగా, వరల్డ్​క్లాస్​ఫెసిలిటీస్​ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్​స్టేషన్ నుంచి రోజూ 1.5 లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా, 180 వరకు రైళ్లు వచ్చిపోతున్నాయి.

 స్టేషన్​ఆధునీకీకరణ పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడం, ఎలక్ట్రానిక్​వాహనాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పార్కింగ్​లాట్లలో భారీగా చార్జింగ్​పాయింట్స్​ఏర్పాటు చేస్తున్నారు. బోయిగూడ వైపు బేస్​మెంట్ పార్కింగ్​ఏర్పాటు చేసిన అధికారులు.. గణేశ్​టెంపుల్​వైపు మల్టీ లెవెల్​పార్కింగ్​లాట్​నిర్మిస్తున్నారు. ఇక్కడే 200 వందల ఈవీ చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు.

 ఇందులో బోయిగూడ లైపు 120  ఛార్జింగ్​పాయింట్స్​ఉండగా, ఫోర్ వీలర్స్​కు 100 , టూ వీలర్స్ కోసం 20 ఉన్నాయి. అలాగే గణేశ్​టెంపుల్ వద్ద నిర్మిస్తున్న మల్టీలెవెల్ పార్కింగ్ లో 80 పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 60 పాయింట్స్ ఫోర్ వీలర్స్ కోసం, మరో 20 టూ వీలర్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే, హైటెక్​సిటీ, నెక్లెస్​రోడ్​, ఫిరోజ్​గూడ, సుచిత్ర సర్కిల్, నేరేడ్​మెట్, హఫీజ్​పేట, బేగంపేట, ఉమ్దానగర్​, సీతాఫల్​మండి రైల్వే స్టేషన్లలో కూడా ఈవీ చార్జింగ్ ​స్టేషన్లను ఏర్పాటు చేశారు.