వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు: వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని రైసు మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సీఎంఆర్ కోసం భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు అప్పగించిన రూ.10.10 కోట్ల వడ్లు మాయమైనట్లు గుర్తించారు.
ఈ మిల్లుకు కేటాయించిన వడ్లలో 2022-–23లో 2,545 మెట్రిక్టన్నులు, 2023–24లో 1,321మెట్రిక్ టన్నులు, 2024–25లో 6,515 టన్నులు మాయమైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.10.10కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా లెక్కలు చూస్తున్నామని తుది నివేదిక పూర్తి కాలేదన్నారు.
దాడుల్లో విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్మెంట్ సీఐ గణేశ్, జీఎస్టీ,రెవెన్యూ, సివిల్ సప్లయి ఆఫీసర్లు పాల్గొన్నారు. ఖిల్లాగణపురం మండల కేంద్రంలోని అన్పాడులోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర రైసు మిల్లుపైనా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
