సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్కే తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సెగ్మెంట్ పద్మశాలి సంఘం తెలిపింది. సికింద్రాబాద్ సెగ్మెంట్ ఐదు డివిజన్ల పరిధిలోని తమ అనుబంధ సంఘాలు పద్మారావు గౌడ్కు మద్దతునిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఒడియన్ శ్రీనివాస్, కార్యదర్శి ఆదేపు రవి
ట్రెజరర్ అంకం శ్రీకాంత్, నేతలు మందా జగన్, సీహెచ్ మల్లేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, పద్మశాలి సంఘం తనకు మద్దతు తెలుపుతూ తీర్మానించడంపై పద్మారావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.