- డివైడర్ను కారు ఢీకొని వృద్ధ దంపతులకు గాయాలు
- షుగర్ లెవెల్స్ పెరగడమే కారణం
కంటోన్మెంట్, వెలుగు : సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో మంగళవారం ఉదయం ఓ వృద్ధ జంట కారు యాక్సిడెంట్లో గాయపడింది. కారు నడపుతున్న భర్త షుగర్లెవెల్స్పెరగడంతో తికమకలో బ్రేక్కు బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఆ వాహనం డివైడర్ను ఢీకొని ఇద్దరూ గాయపడ్డారు. మహేంద్ర హిల్స్కు చెందిన మారుతి, జయలక్ష్మి దంపతులు ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం సికింద్రాబాద్ వైపు బయలుదేరారు.
మారుతి ఉదయం టిఫిన్ తీసుకోకుండా కారు నడుపుతుండడంతో కళ్లు తిరిగాయి. మారేడుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్దకు రాగానే బ్రేక్ వేయబోయి పొరపాటున ఎక్సలేటర్తొక్కాడు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాన్ని పక్కకు తొలగించి ఇద్దరినీ దవాఖానకు తరలించారు.
