నెలన్నర పాటు సికింద్రాబాద్ – బేగంపేట రోడ్డు బంద్ 

నెలన్నర పాటు సికింద్రాబాద్ – బేగంపేట రోడ్డు బంద్ 

సికింద్రాబాద్ – బేగంపేట రోడ్లో రేపటి నుంచి బంద్ కానుంది. దాదాపు నెల రోజుల పాటు దారిని మూసివేయనున్బంనారు. రసూల్పురా జంక్షన్ వద్ద ఉన్న నాలా వెడల్పు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చేపట్టనున్న పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ట్రాఫిక్ ను వన్ వేలో మాత్రమే అనుమతించనున్నారు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వైపుగా వెళ్లే వెహికిల్స్ అన్నింటినీ యాత్రి నివాస్ వద్ద డైవర్ట్ చేయనున్నారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే వాహనాలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.