మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులు హతం

మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు కిషన్ రెడ్డి. 2016 నుంచి ఇప్పటి వరకు 733 మంది ఉగ్రవాదులు చనిపోయారని… ఈ ఏడాది జూన్ 16 వరకు అందిన లెక్కల ప్రకారం 113 మంది హతమయ్యారని చెప్పారు.  అంతేకాదు 18 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు మూడు రెట్లు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో అక్కడ 112 మంది పౌరులు కూడా చనిపోయారని చెప్పారు.

ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు కిషన్ రెడ్డి. టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు భద్రతా దళాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు.