చత్తీస్గఢ్లో రెండు IED లను గుర్తించిన భద్రతా దళాలు

చత్తీస్గఢ్లో రెండు IED లను గుర్తించిన భద్రతా దళాలు

చత్తీస్గఢ్లో రెండు IED లను భద్రతా దళాలు గుర్తించాయి. సుక్మాలోని ఎల్మగుండ, మిన్సా అటవీ ప్రాంతంలో మావోయిస్టుు అమర్చిన రెండు IEDలను భద్రతా బలగాు ధ్వంసం చేశాయి. సుక్మా జిల్లాలో భద్రతాబలగాల క్యాంపు సమీపంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీలను జవాన్లు నిర్వీర్యం చేశారు. బాంబులు, రాకెట్ లాంచర్ ను స్వాధీనం చేసకున్నాయి భద్రతాబలగాలు. నిర్వీర్యం చేసిన ఐఈడీల బరువు 7 కిలోలుగా ఉంటుందని తెలిపారు అధికారులు.

అటు జూన్ 16 ఎల్మగుండ శిబిరానికి 450 మీటర్ల దూరంలో కూడా మావోయిస్టులు బాంబును అమర్చారు. అయితే కోబ్రా 206 కార్ప్స్ కమాండర్ ప్రశాంత్ రాయ్, కమాండర్ సౌరభ్ యాదవ్ నేతృత్వంలో ఈ బాంబును విజయవంతంగా ధ్వంసం చేశారు.