పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ కొత్త ఏడాది గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భం దాల్చినట్లు వెల్లడించింది. త్వరలో తన భర్త సచిన్ బిడ్డకు తల్లిని కాబోతున్నట్లుగా చెప్పి్ంది. 2024 తమకు శుభవార్త తెస్తుందని సీమా హైదర్ తెలిపింది. ఒక ప్రైవేట్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ శుభవార్తను పంచుకుంది. సచిన్ తండ్రి కూడా ఈ వార్త నిజమేనని, సీమా హైదర్ గర్భవతి అనే స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది.
సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నానని చెప్పడంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు అయితే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజు-నస్రుల్లా జంటని తెరమీదకి తీసుకొస్తూ మీరెప్పుడూ గుడ్ న్యూస్ చెప్తారంటూ ప్రశ్నిస్తున్నారు.