సింహంతో సెల్ఫీ..ప్రాణం తీసింది..

 సింహంతో సెల్ఫీ..ప్రాణం తీసింది..
  •  తిరుపతి జూపార్కులో ఘటన

హైదరాబాద్, వెలుగు: సింహంతో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది. తిరుపతిలోని జూపార్క్‌‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‍కు చెందిన ప్రహ్లద్‍ గుర్జర్​ అనే వ్యక్తి లయన్‍ ఎన్​క్లోజర్‍ వద్దకు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్లాడు. సెల్ఫీ తీసుకోవాలని ఎన్​క్లోజర్​లోకి దూకాడు. అక్కడి సిబ్బంది వారిస్తున్నా వినిపించుకోకుండా కంచెను దాటి లోపలికెళ్లాడు. ప్రహ్లాద్ ను చూసిన సింహం దాడికి యత్నించింది. భయపడిపోయిన అతడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి కిందకు పడిపోవడంతో అతడిపై సింహం పంజా విసిరింది. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.