ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు

ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు

సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రార్థి్స్తున్నారు.  పలువురు తారలు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు నటి కరాటే కళ్యాణి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆయనకేమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. 

1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి లాంటి చాలా చిత్రాల్లో నటించి, మెప్పించారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అలా దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకోవడం విశేషం.