గజ్వేల్ నుంచి సంజయ్ పోటీ చేయాలె: విజయశాంతి

గజ్వేల్ నుంచి సంజయ్ పోటీ చేయాలె: విజయశాంతి
  • బీజేపీ సీనియర్ నేత విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ నుంచి బండి సంజయ్ పోటీ చేయాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సూచించారు. గజ్వేల్​లో సీఎంపై పోటీ చేస్తానంటూ గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ ప్రకటిస్తున్న నేపథ్యంలో తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్‌తో పార్టీలో కొత్త చర్చకు తెర తీసింది. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని, పార్టీ కార్యకర్తల విశ్వాసమని బుధవారం పేర్కొన్నారు. అందుకు, గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను అసెంబ్లీకి కేసీఆర్​పై పోటీ చెయ్యాలని కార్యకర్తలు అడగటం తప్పు కాదన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమే అన్నది వాస్తవమన్నారు.