జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బీజేపీలో కలకలం

జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బీజేపీలో కలకలం

మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ ఓ ట్వీట్‌ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్‌ చేశారు ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్‌ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్‌ చేసి.. మళ్లీ పోస్ట్‌ చేయడం మరోసారి  చర్చనీయాంశంగా మారింది.  పైగా ఆ ట్వీట్‌కు అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలను ట్యాగ్‌ చేశారు. 

ఈ మధ్య తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నాయనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే జితేందర్ రెడ్డి చేసిన ట్విట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఈ ట్వీట్ దేనికి సంకేతం? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ ట్వీట్ వివాదాస్పదం అవుతుందని ఆయనకు ముందే తెలుసని, కావాలనే ఈ ట్వీట్ చేసి వైరల్ అయిన తర్వాత డిలీట్ చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

బీజేపీలో సీనియర్ నేతగా జితేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. బీజేపీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్నారు. అలాంటి ముఖ్యనేత సొంత పార్టీ నేతలపై విమర్శలు కురిపించడం ప్రస్తుతం బీజేపీలో దుమారం రేపుతోంది. 

https://twitter.com/apjithender/status/1674302000941645824

 

https://twitter.com/apjithender/status/1674309896458887168

ప్రస్తుతం రాష్ర్ట బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఒక వీడియో ద్వారా జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారని చెబుతున్నారు. అధ్యక్ష స్థానం నుంచి బండి సంజయ్ ను మారుస్తారని, నేతల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో జితేందర్ రెడ్డి ట్విట్ చేశారని మరికొందరు చర్చించుకుంటున్నారు. జితేందర్ రెడ్డి ట్వీట్ పై బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్టేట్ బీజేపీలో చర్చకు వచ్చింది. మొత్తంగా జితేందర్ రెడ్డి ట్విట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.