ఫాంహౌజ్ నాయకులు దేశాన్ని ఎలా బాగుచేస్తరు ? : పొన్నాల

ఫాంహౌజ్ నాయకులు దేశాన్ని ఎలా బాగుచేస్తరు ?   : పొన్నాల

ఫాంహౌజ్లో ఉండి రాజకీయం చేసేవాళ్లు దేశాన్ని  ఎలా బాగుచేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల  లక్ష్మయ్య ప్రశ్నించారు. రాహుల్ గాంధీ యాత్రపై టీఆర్ఎస్కు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. ప్రజలు సరైన సమయంలో కేసీఆర్కు బుద్ది చెప్తారని తెలిపారు. 

రాహుల్ పాదయాత్ర చారిత్రాత్మకం.. 

రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ఈ శతాబ్దంలోనే  చారిత్రాత్మకమైందని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కీలకమైన మూడో ఘట్టమని చెప్పారు. నాడు మహాత్మా గాంధీ చేపట్టిన దండి పాదయాత్ర, ఉప్పు సత్యాగ్రహ యాత్ర స్వాతంత్య్ర పోరాటానికి ఊపునిచ్చిందన్నారు. ఇప్పుడు రాహుల్ యాత్ర కూడా దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోందని చెప్పారు. 

స్వాతంత్య్రం కోసం బీజేపీ పోరాడిందా..?

రాహుల్ గాంధీ పాదయాత్రపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. బీజేపీ నాయకులు స్వాతంత్య్రం కోసం పోరాడారా..? మూడు రంగుల జెండా పట్టుకుని తిరిగారా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం రాక ముందుకు దేశం సంపన్న దేశంగా ఉండేదని.. ఇప్పుడు దేశం అప్పుల పాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజించాలి..  పాలించాలి పరిపాలనలోకి రావాలి అనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు.