సూసైడ్ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ని ఏ వన్గా చేర్చాలె

సూసైడ్ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ని ఏ వన్గా చేర్చాలె

ఖమ్మం: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఖమ్మంలో సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ సూసైడ్ కు కారణమైన మంత్రిపై కేసు నమోదు చేసి ఏ వన్ గా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదన్న ఆమె.... గవర్నర్ పర్యటనలో కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై బాడీ షేమింగ్ కు పాల్పడటం సిగ్గు చేటన్నారు. రేవంత్ రెడ్డిని ఖమ్మం రాకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదన్నారు. కమ్మ కులాన్ని అవమానిస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

మరిన్ని వార్తల కోసం...

హన్మకొండలో కేటీఆర్ టూర్కు ఏర్పాట్లు 

ఈ ‘చాయ్వాలీ’ టీని తాగాల్సిందే బాస్