అమితాబ్ బచ్చన్, రజినీకాంత్‌‌ కాంబోకు స్పెషల్ క్రేజ్

అమితాబ్ బచ్చన్,  రజినీకాంత్‌‌ కాంబోకు స్పెషల్ క్రేజ్

చిత్ర పరిశ్రమలో కొన్ని  క్రేజీ కాంబినేషన్స్‌‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. వాటిలో సీనియర్ హీరోలు అమితాబ్ బచ్చన్,  రజినీకాంత్‌‌ కాంబోకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. 33 ఏళ్ల క్రితం వచ్చిన  ‘హమ్’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించగా, మళ్లీ ఇన్నాళ్లకి  స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు.  ‘జై భీమ్‌‌’ ఫేమ్  టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న 170వ సినిమాలో అమితాబ్ నటించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన  రజినీకాంత్  ‘33 ఏళ్ల తర్వాత నా గురువు అమితాబ్‌‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఇందులో టాలీవుడ్ స్టార్ రానా, మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్ కూడా నటిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.  తమిళనాడు, కేరళ షెడ్యూల్స్ ఇప్పటికే  పూర్తయ్యాయి. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.