కాశ్మీర్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​కు వైరస్

కాశ్మీర్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​కు వైరస్

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కి కరోనా సోకిందని అక్కడి అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో శనివారం ఆయనతో సమావేశమైన పలువురు బ్యూరోక్రాట్స్, డాక్టర్లను హోం క్వారంటైన్ చేశామని తెలిపారు. ఆయన శ్రీనగర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జమ్మూ ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహించగా శనివారం రాత్రి వచ్చిన రిపోర్టులో పాజిటివ్​గా తేలిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయన కాశ్మీర్ లో కరోనా వచ్చిన తొలి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడని అధికారులు తెలిపారు. అంతకు ముందు లెఫ్టినెంట్ గవర్నర్ జేసీ ముర్ము అడ్వైజర్ భార్య, కుమారుడికి వైరస్ సోకింది. దీంతో అడ్వైజర్ కు టెస్టులు నిర్వహించగా నెగెటివ్ రావడంతో హోం క్వారంటైన్ లో ఉంచారు.