ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డి

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కే. శ్రీనివాస్ రెడ్డి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. విశాలాంధ్ర సంపాదకులుగా, జర్నలిస్ట్ యూనియన్ నేత పని చేశారు.

 శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. మీడియా అకాడమీ చైర్మన్‌ క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.