భార్యతో అసభ్యంగా ప్రవర్తించిండని.. దోస్తును చంపిండు

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిండని.. దోస్తును చంపిండు
  • వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్​లో ఘటన

శంకర్​పల్లి, వెలుగు: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫ్రెండ్​ను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన వికారాబాద్​ జిల్లా దౌల్తాబాద్​లో జరిగింది. శనివారం పరిగి డీఎస్పీ కరుణ సాగర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్​కు చెందిన శేఖర్(32), గోపాల్(31) ఇద్దరూ ఫ్రెండ్స్. వీళ్లు వ్యవసాయం చేస్తున్నారు. గత వారం గోపాల్​ ఇంటికి వెళ్లిన శేఖర్.. అతడి భార్యతో అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ విషయం గోపాల్​కు తెలియడంతో శేఖర్​పై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి శేఖర్​ను తీసుకొని దౌల్తాబాద్ ​పట్టణ శివారుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి   మsద్యం తాగారు. గోపాల్​తన భార్య విషయాన్ని తీసుకురాగా.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో   గోపాల్ కోపంలో ​తన చేతిలో ఉన్న బీర్​బాటిల్​తో శేఖర్ తలపై కొట్టాడు.

అదే టైమ్​లో శేఖర్​ భార్య అతడికి కాల్ చేసింది.  కాల్​ లిఫ్ట్ చేసిన శేఖర్ భయపడుతూ..  గోపాల్  పేరును భార్యకు చెప్పాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన గోపాల్.. శేఖర్ మొబైల్​ను లాక్కుని అతడిని గొంతు నులిమి  దారుణంగా హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.  ఫోన్​లో మాటలు విని భయపడిపోయిన శేఖర్ భార్య పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయం శేఖర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించారు.  తన భర్త చివరలో గోపాల్ పేరును చెప్పాడని శేఖర్ భార్య ఎస్సై రమేశ్​కుమార్​కు చెప్పింది.  దీంతో గోపాల్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. ఆ తర్వాత  శేఖర్​ డెడ్​బాడీని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.