ప్రేమిస్తే చంపేస్తారా?: ఎవ్వరినీ వదలనంటున్న హేమంత్ తమ్ముడు

ప్రేమిస్తే చంపేస్తారా?: ఎవ్వరినీ వదలనంటున్న హేమంత్ తమ్ముడు

మా అన్న చావుకు కారణం అయిన ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు పరువు హత్యకు గురైన హేమంత్ తమ్ముడు. శనివారం హేమంత్ తమ్ముడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ…డబ్బులేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళను ప్రేమిస్తే..చంపేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మా అన్న హత్యనే చివరిది కావాలని… ఇంకెవ్వరు చంపబడవద్దన్నారు. అన్న అంత్యక్రియలు మొత్తం పూర్తయ్యాయని…ఇక ప్రతి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్తానన్న సుమన్.. న్యాయం కోసం పోరాటం చేస్తానన్నారు.

చట్టం మీద నమ్మకం ఉందని.. పోలీసులు అమ్ముడు పోకుండా విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. పక్కాగా ప్లాన్ చేసి చంపారని…హంతకుల్లో ఆడవాళ్లు కూడా ఉన్నారన్నారు…ఎవరినీ వదలవద్దని..మా అన్నను…చిత్ర హింసలు పెట్టి చంపారని…చెప్పులతో కొట్టారు…ఇలాంటి చావు ఇంకెవరికి  రావద్దని ఆవేదన వ్యక్తం చేశాడు సుమన్.