ఏటీసీలో కోర్సులకు రేపటిలోగా అప్లై చేసుకోండి

ఏటీసీలో కోర్సులకు రేపటిలోగా అప్లై చేసుకోండి

ఓల్డ్​సిటీ, వెలుగు: బహదూర్​పురాలోని ఖులీ కుతుబ్​షా ప్రభుత్వ ఐటీఐ కాలేజీలోని అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో కోర్సులకు సెప్టెంబర్ 5లోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్​ రేణుక పేర్కొన్నారు. టెన్త్​ లేదా ఆపై ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం అడ్వాన్స్​డ్​సీఎన్​సీ మెషీన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ డిజిటల్  మాన్యుఫాకర్చరింగ్  టెక్నీషియన్,  మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సుల్లో 70 సీట్లు ఉన్నాయన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో జూపార్క్ సమీపంలోని పి.నర్సారెడ్డి కాలనీలో ఉన్న ఏటీసీకి వచ్చి,  అడ్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందవచ్చని తెలిపారు.