ఇళ్లు కూల్చడానికి వచ్చిన జేసీబీ.. అడ్డుకున్న ఎమ్మెల్యే

ఇళ్లు కూల్చడానికి వచ్చిన  జేసీబీ.. అడ్డుకున్న ఎమ్మెల్యే

కూకట్​పల్లి మండలం​ శేరిలింగం పల్లిలోని ఓ కాలనీలో జులై 8న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాపిరెడ్డి కాలనీలోని పలు ఇళ్ల యజమానులు 59 జీవో కింద ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టలేదని ఆరోపిస్తూ అధికారులు వారి నివాసాలు కూల్చేయడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో జేసీబీలతో ఆయా ఇళ్ల దగ్గరికి వచ్చారు. స్థానికులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను వారించారు. 

వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తప్పిదం వల్ల ఏర్పడిన సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ఇదే అంశంపై చర్చలు జరుపుతున్నామని మళ్లీ కూల్చేందుకు రాకూడదని హెచ్చరిస్తూ  తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు.