చాలెంజ్ చేసే వాళ్లు రాజీనామాలతో సిద్ధంగా ఉండండి : పొన్నం ప్రభాకర్​

చాలెంజ్ చేసే వాళ్లు రాజీనామాలతో సిద్ధంగా ఉండండి : పొన్నం ప్రభాకర్​

సైదాపూర్​, చిగురుమామిడి, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంతో చాలెంజ్‌‌‌‌‌‌‌‌ చేసే వాళ్లు రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలని, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అగ్గిపెట్టె రాజకీయాలు మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ విమర్శించారు. కరీంనగర్​ పార్లమెంట్​ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు మద్దతుగా శుక్రవారం చిగురుమామిడి, సైదాపూర్​ మండల కేంద్రాల్లో కార్నర్​ మీటింగ్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలుచేస్తామన్నారు. కానీ ప్రతిపక్ష లీడర్లు తమకు చాలెంజ్‌‌‌‌‌‌‌‌లు విసురుతూ, పిల్లి శాపనార్థాలు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిందన్నారు .