ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే అరెస్ట్ అయినందున పిటిషన్ ను విచారించలేదని స్పష్టం చేసింది . అయితే అరెస్ట్ కు ముందే పిటిషన్ వేశామని చిదంబరం తరపు లాయర్ వాదించగా.. అరెస్ట్ తర్వాత వేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు పరిధిలోకి వచ్చే సీబీఐ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకోవాలని చిదంబరానికి సూచించింది కోర్టు. ఇక తన అరెస్టును సవాల్ చేస్తూ చిదంబరం వేసిన పిటిషన్ పై తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.