కిడ్నాప్ కి గురైన ఓ ఏడేళ్ల బాలిక కేసును నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. అర్మూర్ లోని ఓ మదర్సా నుంచి బయటికి వచ్చిన ఓ పాపను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకొని పారిపోయాడు. గత నెల 29న ఉదయం 10 గంటల సమయంలో ఈ కిడ్నాప్ జరిగింది. బాలిక ఎప్పుడు బయటికొస్తుందా అని ఎదురు చూస్తూ ఆ వ్యక్తి మదరసా ముందే చాలా సేపు గడిపాడు. పాప బయటికి రాగానే చడీ చప్పుడు లేకుండా ఎత్తుకొని పోయాడు. సీసీ పూటేజ్ లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ పూటేజ్ ద్వారా నిందితుడిని పట్టుకొని కిడ్నాప్ కేసు నమోదు చేశారు.