హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల డబ్బును కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పంచారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 16 కార్పొరేషన్ల ఏర్పాటు అభినందనీయమని, కాంగ్రెస్ సర్కా రు అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. కార్పొరేషన్లకు కేబినెట్ఆమోదం తెలిపిందని, త్వరలో గైడ్లైన్స్ ఖరారు చేస్తామని చెప్పారు. కేసీఆర్ భాష గురించి దేశమంతా తెలుసని, బయట, అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని చెప్పా రు. ము స్లిం రిజర్వేషన్లను తొలగించే దమ్ము మోదీ, అమిత్ షాకు లేదన్నారు.
15న ఎల్బీ స్టేడియంలో సీఎం ఇఫ్తార్ విందు
రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. దీనికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా, మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.