ఇటీవల ‘పఠాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్.. ఇప్పుడు ‘జవాన్’గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో చెప్పిన టైమ్కి రావడం పక్కా అని తెలుస్తోంది. జూన్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు షూటింగ్ మొదలుపెట్టినప్పుడే అనౌన్స్ చేశారు.
పర్ఫెక్ట్ ప్లానింగ్తో షెడ్యూల్స్ వేసుకుని అనుకున్న తేదీకి విడుదల చేస్తుండటంపై షారుఖ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో షారుఖ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. నయనతార, ప్రియమణి హీరోయిన్స్. దీపికా పదుకొణె, విజయ్, సంజయ్ దత్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.