
ఇటీవలే UK నుండి వచ్చిన నటుడు షారుఖ్ ఖాన్ తన కంటి చికిత్స కోసం అత్యవసరంగా USA కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఇవాళ కంటి సమస్యతో ముంబైలోని ఒక ఆసుపత్రికి వెళ్లగా చికిత్స నిమిత్తం ఆ డాక్టర్ అమెరికాకు రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. జూలై 30న షారూఖ్ తన కంటి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఐతే షారూఖ్ కు ఇప్పటికే 2014లో కంటి ఆపరేషన్ జరిగింది. కాగా మళ్లీ ఆ సమస్య పునరావృతం అయినట్లు తెలుస్తోంది. షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ మాత్రం ఈ వార్తలను ఇంకా ధృవీకరించలేదు. మరోవైపు షారుఖ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కారణంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆసుపత్రి పాలయ్యాడు.
మళ్లీ ఇప్పుడు అమెరికా ఆసుపత్రికి వెళ్తుండడంతో షారుఖ్ కు ఈ సంవత్సరం అంతగా కలిసిరాలేదని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే షారుఖ్ తదుపరి యాక్షన్- థ్రిల్లర్ కింగ్లో అతని కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ తో కలిసి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా తీయబోయే టైగర్ వర్సెస్ పఠాన్లో కూడా ఖాన్ పఠాన్ పాత్రను తిరిగి పోషించనున్నట్లు ఇండస్ట్రీ టాక్ ఉంది.