గండిపేట, వెలుగు: శంషాబాద్ మండల పరిధిలోని అమ్మపల్లి శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో హుండీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడలోని అమ్మపల్లి దేవాలయంలో 26న రాత్రి 7 గంటలకు పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయం మూసివేశారు.
తిరిగి 27వ తేదీ ఉదయం 5 గంటలకు వెళ్లి చూడగా రెండు తలుపుల తాళాలు పగిలిపోయి అక్కడ ఉన్న చిన్న హుండీ కనిపించకుండాపోయింది. చూడగా, మండప సమీపంలో పగిలిపోయి ఖాళీగా పడి కనిపించింది. అందులోని నగదు కనిపించలేదు. దొంగలు తలుపులను పగలగొట్టి హుండీ చోరీ చేశారని శంషాబాద్ రూరల్పీఎస్లో ఫిర్యాదు చేశారు సీఐ కె నరేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
