
భారత క్రికెట్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే భారత స్టార్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అతియా శెట్టిని వివాహం చేసుకోగా ఆ తరువాత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన ఫ్రెండ్ మేహా పటేల్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో క్రికెటర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. రోహిత్, కోహ్లీల ఫేవరెట్ ప్లేయర్ అయిన శార్దూల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మిథాలీ పారుల్కర్ తో శార్దూల్ వివాహం ఫిబ్రవరి 27న (సోమవారం) జరగనుంది. కాగా శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. 2021 నవంబర్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ వివిధ కారణల వలన వాయిదా పడింది.