అమ్మ ప్రేమను యావత్ దేశానికి పంచుతున్న: రాహుల్

అమ్మ ప్రేమను యావత్  దేశానికి పంచుతున్న: రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జన సందోహం మధ్య ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ తరుణంలో యాత్రలో రాహుల్ తల్లి సోనియాగాంధీ పాల్గొన్నారు. బిజీగా ఉన్న రాహుల్ ను  చూసి సోనియా ఎమోషనల్ అయ్యారు.

రాహుల్ కూడా సోనియా భుజంపై చేయి వేసి.. తల్లిపై తన ప్రేమను చాటుకున్నాడు . దీనికి సంబంధించిన ఒక ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  తన తల్లి నుంచి లభించిన ప్రేమను యావత్ దేశ ప్రజలకు తాను పంచుతున్నానని ఈ పోస్ట్ లో రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.