ఇక నా మాటే..అంటూ సాగే మొదటి పాట

ఇక నా మాటే..అంటూ సాగే మొదటి పాట

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. శర్వా కెరీర్‌‌‌‌లో ఇది 35వ చిత్రం. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్.. ఈనెల 28న ‘ఇక నా మాటే’ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో స్కేటర్ రైడింగ్ చేస్తూ ట్రెండీ అవతార్‌‌‌‌లో ఆకట్టుకున్నాడు శర్వానంద్.

కృతిశెట్టి హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్. అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ డైలాగ్స్‌‌ని అందిస్తున్నారు.